Minister KTR | హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ భవనమైన టీ వర్క్స్లో సమావేశాలు నిర్వహించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని నోటీసులో కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్కుమార్ పేర్కొన్నారు.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి నోటీసు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎన్నికల సంఘం నియమ నిబంధనలు పాటించాలని సీఎం కేసీఆర్కు సూచించింది. సభలు, సమావేశాల్లో మాట్లాడే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించాలని అవినాశ్కుమార్ కేసీఆర్కు సూచించారు.