హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా క్రియాశీలంగా లేని 537 రాజకీయ పార్టీల గుర్తింపును, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దుచేసింది. ఇందులో తెలంగాణ నుంచి రిజిస్టర్ అయిన 20 పార్టీలు కూడా ఉన్నట్టు మంగళవారం తెలిపింది. 1. ఆల్ ఇండియా మహిళా డెమొక్రటిక్ ఫ్రంట్, 2. భారతీయ యువత, సమత, రా ష్ట్రీయత కాంగ్రెస్ పార్టీ, 3. నవ తెలంగాణ పార్టీ, 4. ప్రజా చైతన్య పార్టీ, 5. త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ, 6 అఖండ్ భారత్ నేషనల్ పార్టీ, 7. అఖిలాంధ్ర మహాదేశం, 8. ఆలిండియా ముక్తిదళ్ పార్టీ, 9. ఆలిండియా ముత్తహిద్ క్యుయామి మహాజ్, 10. ఆంధ్రప్రదేశ్ నవోదయ ప్రజాపార్టీ, 11. భారత్ అభ్యుదయ్ పార్టీ, 12. మన పార్టీ, 13. నేషనలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి, 14. ప్రజా భారత్ పార్టీ, 15. ప్రజా పార్టీ, 16. ప్రజాశాంతి పార్టీ, 17. తల్లి తెలంగాణ పార్టీ, 18. యూత్ డెమొక్రటిక్ ఫ్రంట్, 19, సెక్యులర్ డెమొక్రటిక్ లేబర్ ఆఫ్ ఇండియా, 20. సురాజ్ పార్టీ.