హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): జాతీయ, ప్రాంతీయ పార్టీలు దూరదర్శన్, ఆలిండియా రేడియోలో ఎన్నికల ప్రచారానికి ఈసీ సమయాన్ని వీలుకల్పించింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కలిపి దూరదర్శన్లో 898 నిమిషాలు, రేడియోలో 898 నిమిషాల చొప్పున సమయాన్ని కేటాయించింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను ప్రాతపదికగా తీసుకుని అత్యధికంగా బీఆర్ఎస్కు 277 నిమిషాలు చొప్పున కేటాయించిన ఈసీ.. కాంగ్రెస్కు 185, బీజేపీకి 79 నిమిషాల చొప్పున కేటాయించింది. అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించిన నాటి నుంచి ప్రచారపర్వం ముగిసేవరకు పార్టీలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ముందుగా రికార్డ్ చేసిన ప్రసంగాలను దూరదర్శన్, రేడియో నిర్వాహకులకు అందించా లి. ఆ ప్రసంగాల రికార్డింగ్కు అయ్యే ఖర్చు ను రాజకీయ పార్టీలే భరించాల్సి ఉంటుంది.