ప్రభుత్వ విప్ బాల్క సుమన్ హెచ్చరిక
కమలాపూర్, ఆగస్టు 9: సీఎం కేసీఆర్, ఆర్థిక మంత్రి హరీశ్రావును విమర్శించేస్థాయి ఈటల రాజేందర్కు లేదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పథకానికి సీఎం కేసీఆర్ 500 కోట్లు కేటాయించడంతో సోమవారం కమలాపూర్లో అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి, పటాకు లు కాల్చి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడారు. ‘రా కేసీఆర్, రా హరీశ్రావు.. దమ్ముంటే ఇక్కడ పోటీచెయ్’ అంటూ బీజేపీ నాయకుడు ఈటల మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుల స్థాయి నీది కాదు.. ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తను నిలబెట్టి గెలిపించుకుంటం’ అని తెలిపారు. కేసీఆర్ రాజకీయ భిక్షపెడితే ఇతర పార్టీల నాయకులతో కలిసి ఈటల పార్టీని విచ్ఛి న్నం చేసేందుకు కుట్ర పన్నాడని విమర్శించారు. నియోజకవర్గంలో ఏ వ్యక్తి ఎదుగకుండా నిరంకుశంగా పాలించిన వ్యక్తి ఈటల అని పేర్కొన్నారు. నియంతలా పాలించిన వ్యక్తి కావాలో? ప్రజాస్వామ్యయుతంగా పాలించే వ్యక్తి కావాలో? హుజూరాబాద్ ప్రజలు ఆలోచించాలని కోరారు. దళితబంధు కోసం కేంద్రం నుంచి రూ.50 వేల కోట్లు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దళితబంధును ఆపేందుకు బీజేపీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారన్నారు. ‘వారు అన్నం పెట్టరు.. అన్నం పెట్టే కేసీఆర్ను పెట్టనీయరుఅని విమర్శించారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి, జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్ మండల కేంద్రంతోపాటు పలు గ్రామాలకు చెందిన బీజేపీ కార్యకర్తలు బాల్క సుమన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.