హైదరాబాద్ : తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం 2:03 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4గా నమోదైంది. కరీంనగర్కు ఈశాన్యంగా 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైంది. ఈ ప్రభావం సమీప జిల్లాలపై పడింది.
మంచిర్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. మంచిర్యాల, నస్పూర్, రాంనగర్, గోసేవ మండల్ కాలనీలో భూమి కంపించినట్లు స్థానికులు పేర్కొన్నారు. దీంతో భయాందోళనతో ఇండ్లలో నుంచి జనాలు బయటకు పరుగులు తీశారు. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.