నల్లగొండ ప్రతినిధి, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): మునుగోడు అభివృద్ధి కేవలం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్తోనే సాధ్యమని అక్కడి ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని, మునుగోడులో గులాబీ జెండా ఎగురడం ఖాయమని రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యక్తిగత, కుటుంబ స్వార్థం కోసమే మునుగోడు ఉపఎన్నిక తెచ్చిపెడుతున్నాడని విమర్శించారు. మూడున్నర ఏండ్లు ఎమ్మెల్యేగా ఉండి మునుగోడు అభివృద్ధిని విస్మరించి ఇప్పుడు అభివృద్ధి పల్లవి ఎత్తుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
మంగళవారం నల్లగొండలో మీడియాతో ఆయన మాట్లాడా రు. అన్ని వనరులు ఉన్నప్పటికీ నల్లగొండను కరువు ప్రాంతంగా, ఫ్లోరైడ్ జిల్లాగా సమైక్యపాలకులు ప్రపంచ పటంలోకి చేర్చారని, అలాంటి జిల్లాను సీఎం కేసీఆర్ అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేశారని చెప్పా రు. రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే దేశంలోనే అత్యధిక ధాన్యం ఉత్పత్తి చేసిన జిల్లాగా నల్లగొండ రికార్డు సృష్టిందని, ఇదే అభివృద్ధికి నిదర్శమని జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో ఎక్కువ ప్రయోజనాలు పొందిన జిల్లా నల్లగొండేనని స్పష్టంచేశారు. మునుగో డులో భారీ మెజార్టీతో టీఆర్ఎస్ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. పార్టీల ద్వారా సంపాదించుకున్న పదవులను వ్యాపారాల కోసం రాజగోపాల్రెడ్డి అమ్ముకుంటారని మంత్రి విమర్శించారు.
21 వేల కోట్ల రూపాయల టెండర్లు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో దిక్కులేని బీజేపీలో ఆయన చేరుతున్నారని పేర్కొన్నారు. అ భివృ ద్ధి పేరు చెబుతూ బీజేపీలో చేరుతున్న రాజగోపాల్రెడ్డి.. మునుగోడు కోసం మోదీ, అమిత్షాను ఒప్పించి 10 వేల కోట్లు తేగలడా ..? అని ప్రశ్నించారు. కేసీఆర్తోనే రాష్ర్టానికి, దేశానికి లాభమని, ఉపఎన్నిక తర్వాత రాజగోపాల్రెడ్డి కుటుంబం రాజకీయాల నుంచే కనుమరుగు కావడం ఖాయమని అన్నారు. మం త్రి వెంట ఎంపీ బడుగుల, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, కంచర్ల భూపాల్రెడ్డి ఉన్నారు.