హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ఎప్సెట్ అగ్రికల్చర్, ఫార్మసీ (ఏపీ) విభాగం హాల్టికెట్లు గురువారం, ఇంజినీరింగ్ హాల్టికెట్లు ఈ నెల 27న విడుదలవుతాయి. ఆయా తేదీల్లో హాల్టికెట్లను జేఎన్టీయూ అధికారులు వెబ్సైట్లో పొందుపరుచనున్నారు.
మే 4 నుంచి ఎప్సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇంజినీరింగ్కు 150, అగ్రికల్చర్, ఫార్మసీకి 110 చొప్పున సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.