హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్ర్తాలను ఈ-వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 25 వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు పోర్టల్ ద్వారా 354 లాట్ల వస్త్రాలను వేలం వేస్తామని తెలిపింది. ఇందులో సిల్క్, పాలిస్టర్, నైలాన్, నైలెక్స్, ఆర్ట్సిల్క్, ఓణీలు, బ్లౌజ్పీస్లు కొత్తవి, వినియోగించినవి ఉన్నాయని పేర్కొన్నది. వివరాలకు టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in లేదా www.tirumala.org ని సంప్రదించాలని టీటీడీ అధికారులు తెలిపారు.
ఎస్వీబీసీ ట్రస్టుకు అజ్ఞాత భక్తుడి 2 లక్షల విరాళం
తిరుపతి శ్రీవేంకటేశ్వర భక్తి చానల్ ట్రస్టుకు బుధవారం రూ.2 లక్షల విరాళం అందింది. ఓ అజ్ఞాత భక్తుడు ఈ మొత్తాన్ని అందజేశారు.