Ground Water | హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, చెక్డ్యామ్ల నిర్మాణాలు, ఇతర జలసంరక్షణ చర్యలు అద్భుత ఫలితాలను ఇస్తున్నాయి. వీటి ఫలితంగా భూగర్భ జలాలు ఏటికేడు భారీగా పెరుగుతున్నాయి.
2013తో పోల్చితే ప్రస్తుతం భూగర్భజల మట్టం 4 మీటర్ల మేరకు వృద్ధి చెందిందని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం భూగర్భ జలాలు 56 శాతం (472 టీఎంసీల నుంచి 739 టీఎంసీలకు) పెరిగాయని కేంద్ర, రాష్ట్ర భూగర్భ జల శాఖలు తమ సంయుక్త నివేదికలో వెల్లడించాయి. రాష్ట్రంలో భూగర్భ జలాల వెలికితీత గత తొమ్మిదేండ్లలో 58 శాతం నుంచి 39 శాతానికి తగ్గినట్టు ఈ నివేదిక తేల్చింది. 2023 సంవత్సరానికి సంబంధించి ‘తెలంగాణ స్టేట్ డైనమిక్ గ్రౌండ్ వాటర్ రిసోర్సెస్’ పేరుతో రూపొందించిన నివేదికను ఇటీవల ఇరిగేషన్శాఖ రాష్ట్రస్థాయి కమిటీ ఆమోదించింది.