TSRTC | హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : దసరా పండుగకు సొంతూళ్లకెళ్లే వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 13 నుంచి 25 వరకు 5,265 ప్రత్యేక బస్సులను నడపనున్నది. ఈ బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించింది.
22న సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24న ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనున్నది. గత దసరా కంటే ఈసారి దాదాపు 1,000 (20 శాతం) బస్సులను అదనంగా నడుపుతున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ తెలిపారు.