హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): ధూప దీప నైవేద్యం పథకం అర్చకుల పోరాటం ఫలించింది. ఆరు నెలలుగా పెం డింగ్ ఉన్న వేతనాల విడుదల కోసం అర్చకు లు చలో సచివాలయం కార్యక్రమానికి పిలుపునివ్వడం, వీరి ఆందోళనకు బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ అండగా నిలిచిన నేపథ్యంలో ప్ర భుత్వం ఆగమేఘాల మీద స్పందించింది. మంగళవారం కొన్ని గంటల వ్యవధిలోనే అ ర్చకుల ఖాతాల్లో పెండింగ్ వేతనాలను జమ చేసింది. అర్చక సంఘాల నేతలు చలో సచివాలయానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కామారెడ్డి, నిజామాబాద్, వికారాబాద్ తదితర జిల్లాల నుంచి బయలుదేరిన అర్చకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఈ వ్యవహారంపై మంగళవారం తెలంగాణభవన్లో మీడియా సమావేశం నిర్వహించిన దేవీప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సిరిసిల్ల రాజయ్యతో అర్చక, ఉద్యోగ జేఏసీ ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి, వేతనాలను విడుదల చేసింది. అర్చకులకు వేతనాలు జారీచేయడంపట్ల తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ ఛైర్మన్ గంగు ఉపేంద్రశర్మ హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని 6,441 దేవాలయాల్లో కేసీఆర్ ప్రభుత్వం దూప దీప నైవేద్యం పథకాన్ని అమలు చేయడమే కాకుండా ఇటీవల వారి వేతనాలను రూ.6,000 నుంచి రూ.10,000కు పెం చింది. ఈ ఉత్తర్వులు అమలయ్యేలోగా ఎన్నికల కోడ్ రావడంతో అర్చకుల వేతనాల విడుదల నిలిచిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర భుత్వం ఏర్పడటం, రెండు నెలలుగా దేవాదాయశాఖ అర్చకుల వేతనాలపై దృష్టి కేంద్రీకరించకపోవడంతో ఈ సమస్య మరింత జటిలం గా మారింది. అర్చకులు మంగళవారం రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన ప్రభుత్వం ఆరువేల మంది డీడీఎన్ అర్చకులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ అర్చకులకు వేతనాలను విడుదలచేశారు. కేసీఆర్ ప్ర భుత్వం పెంచిన విధంగా రూ.10 వేల చొ ప్పున వేతనాలు అందజేయడం విశేషం.