కోదాడ రూరల్: పారిశుధ్యానికి, పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆహర్నిశలు పాటుపడుతున్నా.. కోట్ల రుపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కొంతమంది వ్యాపారులు నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నా రు. వారి నిర్లక్ష్యానికి పట్టణ శివార్లు డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి.
సోమవారం పట్టణంలోని బొడ్రాయిబజారుకు చెందిన ఓ వ్యాపారి తన వద్ద కాలం చెల్లిన ప్రముఖ కంపెనీలకు చెందిన కుర్ కురే, లేస్ తదితర తినుబండరాల ప్యాకెట్లను హుజూర్నగర్ రోడ్డులోని ఫ్లెఓవర్ సమీపంలో సర్వీస్ రోడ్డు వెంట భారీ ఎత్తున ట్రాక్టర్లతో తీసుకొచ్చి పడేశారు.
దీంతో సమీప ప్రజల ఫిర్యాదు మేరకు మున్సిపల్ సిబ్బంది పోలీసుల సాయంతో అక్కడకు చేరుకుని ప్యాకెట్లను పార వేస్తున్న ట్రాక్టర్లతో పాటు డ్రైవర్ను స్టేషన్కు తరలించారు.