హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి జారీచేసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని 5,085 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 6న పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసింది. ఈ నెల 19న అర్ధరాత్రి 12 గంటల నుంచే అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. అక్టోబర్ 21 వరకు ఆన్లైన్లోనే స్వీకరిస్తారు. నవంబర్ 20 నుంచి 30 వరకు నియామక పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారమే వయో పరిమితి సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు సహా ఇతర వివరాల కోసం అభ్యర్థులు https://schooledu. telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
అర్హతలు, నిబంధనలు