నల్లగొండ: మిర్యాలగూడలో (Miryalaguda) రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పట్టణంలోని నందిపాడు నవనీత వైన్స్ వద్ద రెండు వర్గాలుగా విడిపోయిన యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. మద్యం మత్తులో బ్లేడ్లతో ఒక వర్గంపై మరో వర్గం దాడికి పాల్పడింది. దీంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టారు. గాయపడినవారిని దవాఖానకు తరలించారు. ఈ ఘటనాపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.