హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): శివరాత్రి సమీపిస్తున్న వేళ శ్రీకాళహస్తీశ్వరాలయంపై ఓ డ్రోన్ ఎగరడం తీవ్ర కలకలం రేపింది. ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరవేసి వీడియోలు చిత్రీకరించారు. ఈ ఘటనను గుర్తించిన సెక్యూరిటీ వారిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఆలయంపై డ్రోన్ ఎగరవేసినవారు తమిళనాడుకు చెందినవారిగా గుర్తించారు.