మహబూబ్నగర్: జిల్లాలోని జడ్చర్లలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలంలోని చిట్టిబోయినపల్లి వద్ద ఆర్టీసీ బస్సు.. కంటైనర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
ప్రమాదానికి గురైన బస్సు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి డిపోకు చెందిందని, అది తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తున్నదని చెప్పారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.