వరంగల్: వరంగల్ (Warangal) జిల్లా చెన్నారావుపేట (Chennaraopet) మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని లింగాపురం గ్రామంలో వ్యవసాయ పొలం దున్నుతున్న ఓ ట్రాక్టర్ (Tractor) ప్రమాదవశాత్తు బావిలో పడిపోయింది. దీంతో డ్రైవర్ నీటమునిగి చనిపోయారు. శుక్రవారం తెల్లవారుజామున అజ్మీర కీమ (Ajmera Keema) అనే ట్రాక్టర్ డ్రైవర్ (Tractor Driver) లింగాపురం శివారులోని ఓ వ్యవసాయ భూమిని దున్నుతున్నాడు. దున్నుకుంటూ రివర్స్ వెళ్లే క్రమంలో ఇంజిన్తోసహా అతడు బావిలో పడిపోయాడు.
బావిలో ట్రాక్టర్ తలకిందులుగా పడిపోవడంతో ఇంజిన్తోపాటు అతడూ నీట మునిగిపోయాడు. దీంతో అతడు అక్కడికక్కడే ఊపిరివదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్రేన్ సాయంతో ట్రాక్టర్ను బయటకు తీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.