సింగిల్పట్టి మిర్చి క్వింటాల్కు రూ.40 వేలు
ఎనుమాముల మార్కెట్లో రికార్డుస్థాయి ధర
కాశీబుగ్గ, మార్చి 8: వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం సింగిల్ పట్టి మిర్చికి రికార్డు స్థాయిలో ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే అత్యధికంగా ధర వచ్చినట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పంట దిగుబడి తగ్గినా ధరలు పెరగడంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన బీ సుధాకర్రావు అనే రైతు 11 బస్తాల సింగిల్పట్టి మిర్చిని తీసుకురాగా అత్యధికంగా క్వింటాల్కు రూ.40 వేలు చెల్లించి కొనుగోలు చేశారు. అలాగే వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలి గ్రామానికి చెందిన ఎం తిరుపతి 17 బస్తాల పత్తి తీసుకురాగా క్వింటాల్కు రూ.10,100 పలికింది.