కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 25: నిరుపేద దళితుల తలరాత మార్చేందుకే ప్రభుత్వం దళితబంధుకు శ్రీకారం చుట్టిందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. అణగారిన వర్గాల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్.. అంబేద్కర్, జ్యోతిబాపూలే, జగ్జీవన్రామ్లాంటి మహనీయుల కలలను సాకారం చేస్తున్నారని కొనియాడా రు. కరీంనగర్లోని 3, 19, 25, 26వ డివిజన్లలో లబ్ధిదారులు ఏర్పాటు చేసుకొన్న దళితబంధు యూ నిట్లు, కార్ఖానగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్మార్ట్ క్లాస్రూంను శనివారం మంత్రి ప్రారంభించారు.
అనంతరం కొత్తపల్లి మండలం ఎలగందుల, ఖాజీపూర్ గ్రామాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఆయాచోట్ల గంగుల మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసేవని, సీఎం కేసీఆర్ వారి బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషిచేస్తున్నారని చెప్పారు. దళితబంధును పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన హుజూరాబాద్ నియోజకవర్గంలో 13,500 మంది లబ్ధిదారుల్లో ఇప్పటికే 11,500 మందికి యూనిట్లను గ్రౌండింగ్ చేసినట్టు స్పష్టంచేశారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 52 స్కూళ్లలో స్మార్ట్ క్లాస్రూంల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. అనంతరం పలువురు విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశారు.