Aarogyasri Trust | ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్గా ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ సుధాకర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ పసునూరి దయాకర్రావు సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్రావులాంటి ప్రతిభావంతుడికి ఆరోగ్యశ్రీ ట్రస్టు చైర్మన్గా సీఎం అవకాశం కల్పించారన్న మంత్రి.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సుధాకర్రావులాంటి అనుభవం గల వ్యక్తికి ఆరోగ్యశ్రీకి అవసరమన్నారు. ఆయన సేవలు ప్రజలకు చాలా అవసరం ఉన్నాయన్నారు. సుధాకర్రావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ పదవికి వన్నె తెచ్చారంటూ కొనియాడారు. ఆయన పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన వ్యక్తికావడం అభినందనీయమన్నారు. అనంతరం సుధాకర్రావును పలువురు అభినందించారు.