హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): మాజీ ఎమ్మెల్యే, ఎండోక్రైనాలజిస్ట్గా అంతర్జాతీయ గుర్తింపు పొందిన డాక్టర్ నెమురుగొమ్ముల సుధాకర్రావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని వడ్డేకొత్తపల్లికి చెందిన సుధాకర్రావు 1974 లో ఎంబీబీఎస్, 1984లో డీఎం పూర్తి చేశా రు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఉద్యోగం ప్రారంభించి, గాం ధీ మెడికల్ కాలేజీలో ఎండోక్రైనాలజీ విభాగం హెడ్గా 1999లో రిటైర్ అయ్యారు. ఆ తర్వాత పలు ప్రై వేట్ మెడికల్ కాలేజీల్లో వివిధ హోదాల్లో కొ నసాగి వేల మంది విద్యార్థుల ను తీర్చిదిద్దారు. జాతీయ, అం తర్జాతీయ సదస్సుల్లో పాల్గొని 8 పరిశోధన పత్రాలను ప్రచురించారు. జాతీయ, అం తర్జాతీయ వైద్యుల సొసైటీల్లో సభ్యుడిగా ఉన్న ఆయనకు 2014లో ఎండోక్రైనాలజీ విభాగంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, 2016లో డయాబెటిక్ విభాగంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు వరించాయి.
రాజకీయ కుటుంబం..
సుధాకర్రావు తండ్రి యతిరాజారావు ఉమ్మడి ఏపీలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. 1999 నుంచి 2003 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ రా వు అంచనాల కమిటీ సభ్యుడిగా, ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్గా వ్యవహరించారు. నిరుడు ఆగస్టు 14న ఆయనను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా నాటి సీఎం కేసీఆర్ నియమించారు.
ప్రముఖుల సంతాపం
సుధాకర్రావు మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సుధాకర్ రావు మృతి బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డితోపాటు పలువురు నేతలు సంతాపం తెలిపారు. సుధాకర్రావు పార్థివదేహాన్ని గురువారం స్వగ్రామం వడ్డేకొత్తపల్లికి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నారు.