Rythu Bandhu | షాద్నగర్, ఫిబ్రవరి 25 : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలం కొందుర్గు మండల వ్యవసాయ శాఖ పరిధిలోనూ రైతుబంధు నిధులు పక్కదారి పట్టినట్టు తెలిసింది. రైతుల పేరిట నకిలీ పత్రాలను సృష్టించి వాటికి బ్యాంకు ఖాతాలు తెరిచి నిధులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా రైతు బీమా సొమ్మునూ కాజేసినట్టు తెలుస్తున్నది.
ఒకే ఖాతాకు రైతుబంధు, రైతుబీమా నిధులు వెల్లడంతో అనుమానం వచ్చిన సంబంధిత శాఖ అధికారులు లోతుగా విచారిస్తున్నట్టు సమాచారం. ఇదిలావుంటే సంబంధిత అధికారిని రెండు రోజుల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిసింది. కాగా నిధుల దుర్వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టతనివ్వడం లేదు.