లబ్ధిదారులతో వీడియోకాల్లో మాట్లాడిన స్పీకర్
నస్రుల్లాబాద్, జూన్ 6 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం పథకంతో నిరుపేదల సొంతింటి కల సాకారమవుతున్నదని, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో అర్హులందరికీ ఇండ్లు మంజూరు అవుతున్నాయని కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ ఎంపీపీ విఠల్ అన్నారు. మండలంలోని సంగెం గ్రామంలో రూ.1.80 కోట్లతో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులతో వీడియోకాల్ ద్వారా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం చిత్రపటాలకు లబ్ధిదారులు క్షీరాభిషేకం చేశారు.