నిజామాబాద్ : అర్హులకు నిష్పక్షపాతంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయించామని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. జిల్లాలోని వేల్పూర్లో లబ్ధిదారులతో అట్టహాసంగా గృహ ప్రశాలు చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఇండ్లు మంజూరు చేశామన్నారు.
ఈ సందర్భంగగా మంత్రి మాట్లాడుతూ..మంచి పనులు జరిగేపుడు చెడగొట్టే వారు చాలా ఉంటారు. వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వాలు ఇండ్లు ఇచ్చి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నారు. ఏడేళ్లలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు.
రాబోయే రోజుల్లో సొంత జాగా ఉన్నవారందరికి డబుల్ ఇండ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేశారు. 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ,కాంగ్రెస్ వారు ఇలాంటి ఒక్క ఇల్లు కూడా పేదల కోసం కట్టించలేకపోయారని విమర్శించారు. ఇలాంటివారి మాటలు నమ్మొదన్నారు.
ప్రజలను రెచ్చగొడుతున్నవారు ఒక్కసారి గుండెల మీదచేయివేసుకొని ఆలోచించుకోవాలని హితవు పలికారు. వేల్పూర్లో 112 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకోసం 7 కోట్ల రూపాయాలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.