DOST | హైదరాబాద్ : డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. బుధవారం దోస్త్ కమిటీ సమావేశాన్ని నిర్వహించి షెడ్యూల్ను ఖరారు చేస్తారు. ఈ సారి మూడు విడుతల్లో సీట్లను భర్తీ చేస్తారు. శుక్రవారం దోస్త్ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి తెలిపారు.