హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలలో మొదటి సంవత్సరం ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్-2024) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు గురువారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు.