Telangana | హైదరాబాద్ : తెలంగాణలో ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మద్యం బాటిళ్లు కనిపిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో గత వారం రోజుల నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన 1330 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారని మంత్రి పేర్కొన్నారు.
గోవా, హర్యానా నుంచి లేబుల్స్ లేని మద్యం బాటిళ్లను ఇక్కడికి అక్రమంగా తీసుకొచ్చి విక్రయిస్తున్నారని తెలిపారు. అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల మద్యం రాష్ట్రంలో అమ్మడం నేరం అని మంత్రి స్పష్టం చేశారు. డిపోల నుంచి సరఫరా అయిన మద్యం మాత్రమే సురక్షితమైందని మంత్రి పేర్కొన్నారు. మద్యం మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించిన ఎక్సైజ్ అధికారులను మంత్రి అభినందించారు.
హైదరాబాద్ లోని శంషాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ను స్వాధీనం చేసుకోవడం జరిగింది, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా చాకచక్యంగా వ్యవహరించిన ఎక్సైజ్ అధికారులను అభినందించడం జరిగింది. pic.twitter.com/AXfvesDOUp
— V Srinivas Goud (@VSrinivasGoud) May 17, 2023