Dharmapuri Arvind | సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు టికెట్ కేటాయించడంతో బీజేపీలో అసమ్మతి సెగ రాజుకుంది. మళ్లీ నిజామాబాద్ టికెట్ను అర్వింద్కే కేటాయించడంపై బీజేపీ నేత మీసాల శ్రీనివాస్, కార్పొరేటర్ మీసాల సవిత వ్యతిరేకిస్తున్నారు. డేరా బాబా, నిత్యానందకు టికెట్ ఇచ్చినా ఓకే కానీ.. ధర్మపురి అర్వింద్కు మాత్రం ఇవ్వవద్దని పార్టీ అధినాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.
ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ నుంచే కాదు.. అసలు లోక్సభ బరిలో ఉండటానికే అనర్హుడు అని మీసాల శ్రీనివాస్ విమర్శించారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిపై జాతీయ నాయకత్వం పునరాలోచన చేయాలని మీసాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తే క్షేత్రస్థాయిలో పార్టీకి అంత నష్టం జరుగుతుందని హెచ్చరించారు. అర్వింద్నే ఎంపీ అభ్యర్థిగా కొనసాగిస్తే మాత్రం నిజామాబాద్లో ఓడిపోవడం ఖాయమని తేల్చిచెప్పారు.