చండూరు : స్వార్ధం, అహంకారంతో వచ్చిన మునుగోడు ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలని మంత్రి హరీశ్రావు ఓట్లర్లకు విజ్ఞప్తి చేశారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి మాట్లాడారు. ‘‘దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల్లో ఆడిన డ్రామాలనే బీజేపీ నాయకులు మళ్లా మొదలు పెట్టిండ్రు . వారి మాటాలకు పడవద్దు. ఓడిపోయేవాడు ఆగం ఆగం చేస్తడు . టీఆర్ఎస్ శ్రేణులు జాగ్రత్తగా ఉండాలే’’ అని సూచించారు.
గ్యాస్ ధర రూ. 400 నుంచి రూ. 1200 చేశారని,డీజిల్, పెట్రోల్ రేట్లు అమాంతం పెంచారని,ప్రభుత్వ సంస్థలను అమ్మేశారని దుయ్యబట్టారు.‘ బాయి దగ్గర మోటర్లకు మీటర్లు పెడుతాం అంటున్నారు.రేట్లు పెంచుతాం అంటున్నారు. ఇటువంటి వాళ్లకు ఓట్లు వేయవద్ద’ ని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు పెట్టించారని ప్రజలుజాగ్రత్త గా చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, బీజేపీ పార్టీ ఒక్క పనైనా చేసిందా అని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు ఇస్తే రాజగోపాల్ రెడ్డి పేదలకు ఒక్క ఇల్లు కట్టలేదని విమర్శించారు. ప్రతి మూడు నెలలకు నియోజకవర్గానికి వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. మంత్రి హరీశ్రావు వెంట మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యేలు వినయ భాస్కర్, సుమన్,ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు.