ఘట్కేసర్,జూలై26 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా ఆధునీకరించడానికి సీఎం కేసీఆర్ రూ.7,200 కోట్లను కేటాయించారు. మనఊరు -మనబడికి దాతలు సహకరించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ జిల్లా పరిషత్ పాఠశాలల విద్యార్థులకు మున్సిపాలిటీ కోఆష్షన్ సభ్యుడు బొక్క సురేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు బొక్క విష్ణువర్దన్రెడ్డి స్థాపించిన అక్షయ పౌంఢేషన్ ఆధ్వర్యంలో నోటు పుస్తకాలను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను మెరుగు పర్చేందుకు దుష్టిపెట్టారని అన్నారు. అన్ని ప్రాంతాలలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలలను ఆధుకరించేందుకు తగిన నిధులు కేటాయించారని పేర్కొన్నారు.
విద్యలో ప్రపంచ స్థాయిలో పోటే పడేందుకు పాఠశాలల అభివృద్ధికి సీఎం కేసీఆర్ నడుం బిగించారన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి,మున్సిపల్ చైర్పర్సన్ ఎం.పావని, కౌన్సిర్లు పాల్గొన్నారు.