Srisailam | శ్రీశైల దేవస్ధానం ఆధ్వర్యంలో గోసంరక్షణార్దం నిర్వహిస్తున్న గోశాలకు రూ. 2లక్షల విరాళం ఇచ్చారు. సోమవారం హైదరాబాద్ నగర వాసి శ్రీనివాస విజయ గణపతి రూ 1,00,116, సికింద్రాబాద్ వాసి ఉమామహేశ్వరరావు రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఆలయ పర్యవేక్షకుడు నాగరాజుకు దాతలు చెక్కు రూపంలో విరాళాలు అందించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.