చిన్నకోడూరు, అక్టోబర్ 8: బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీకి విరాళాలు వెళ్లువెత్తుతున్నాయి. సిద్దిపేట జిల్లాకు చెందిన వివిధ అసోసియేషన్స్, సంఘాలు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందజేస్తున్నారు. చిన్నకోడూర్ మండలం గంగాపూర్ గ్రామ యాదవ సంఘం సభ్యులు రూ.10 వేలు, విఠలాపూర్ యువజన సంఘం రూ.20 వేలను ఆదివారం రాష్ట్ర టీఆర్ఎస్ కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మకు చిన్నకోడూరులో అందించారు. నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రూ.15,016 విరాళంగా మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాగుల సారయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ్, రైతు సమితి మండల అ్యక్షుడు కిష్టారెడ్డికి అందజేశారు. ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందిన వారితో పాటు గ్రామస్థులు ఈ విరాళం అందజేయడం గమనార్హం.
బీఆర్ఎస్ విజయవంతం కావాలి
విజయదశమి రోజు ప్రారంభమైన బీఆర్ఎస్ పార్టీ విజయవంతం కావాలని కోరుకుంటున్నా. కేసీఆర్ జాతీయ పార్టీని నెలకొల్పడం సంతోషం. మన తెలంగాణ వ్యక్తి జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టడం ఆనందంగా ఉన్నది. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజల ఆదరాభిమానాలు, మద్దతు కేసీఆర్కు ఉంటుంది. బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది.
– కరుణాకర్ మాధవరం, ఏటీఏ మాజీ అధ్యక్షుడు
తెలంగాణ గాంధీ కేసీఆర్
శాంతియుత మార్గంలో ఉద్యమాన్ని నడిపి రాష్ర్టాన్ని సాధించిన తెలంగాణ గాంధీ కేసీఆర్. సీఎం కేసీఆర్ చర్యల ఫలితంగా తెలంగాణ దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందింది. కేసీఆర్ ఇప్పుడు జాతీయ పార్టీ ఏర్పాటుచేయటం చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు దేశానికి బీఆర్ఎస్ వంటి పార్టీ అవసరం.
– రాజు చింతల, ఇండియానా ఇండియా బిజినెస్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు