బాల్కొండ/సిద్దిపేట, అక్టోబర్ 15: బీఆర్ఎస్కు విరాళాలు వెల్లువలా వస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు సీఎం కేసీఆర్కు అండగా నిలువాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆసరా పింఛన్ లబ్ధిదారులు.. తమ పెన్షన్ నుంచి కొత్త మొత్తాన్ని ఇవ్వగా, రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాల ద్వారా లబ్ధిపొందిన వారు సైతం తమకు తోచిన విధంగా అందజేశారు. ఇలా జమ చేసిన రూ.90 వేల నగదును శనివారం బాల్కొండ మండల టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులకు అందజేశారు. స్వచ్ఛందంగా ముందుకొచ్చి కేసీఆర్కు మద్దతుగా నిలబడిన మహిళా సంఘాల ప్రతినిధులు, బీడీ కార్మికులు, రైతుబంధు, ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాగా సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, వ్యవసాయ మార్కెట్ కమిటీలో వ్యాపారాలు నిర్వహిస్తున్న హోల్సేల్ కూరగాయల వ్యాపారులు రూ.22 వేలు, చేపల వ్యాపారులు రూ.3,500, రైస్ అండ్ ఆయిల్మిల్ ఆపరేటర్లు రూ.5 వేల విరాళాలను సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితా వేణుగోపాల్రెడ్డి, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకుడు మచ్చ వేణుగోపాల్రెడ్డికి అందజేశారు.