భీమారం/ధర్పల్లి, నవంబర్ 5: బీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్కు ఎన్నికల ఖర్చుల కోసం పోలంపల్లి సర్పంచ్ దర్శనాల రమేశ్ రూ. 51 వేల సాయమందించారు. విప్ భారీ మెజార్టీ గెలుస్తాడని ఆకాంక్షించారు.
నిజామాబాద్ రూరల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు ఎన్నికల ఖర్చుల కోసం ధర్పల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ రూ.1,00,116 విరాళంగా అందజేశారు. బాజిరెడ్డి నివాసానికి ఆదివారం వెళ్లి, ఎమ్మెల్యేను సన్మానించి విరాళాన్ని ఇచ్చారు.