భద్రాచలం, మే 16: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూ.కోటి విరాళంగా అందించింది. నేరుగా అన్నదాన ఖాతాకు ఈ మొత్తాన్ని ఆన్లైన్ ద్వారా జమ చేసినట్టు ఈవో శివాజీ సోమవారం వెల్లడించారు. భూరి విరాళాన్ని అందజేసిన సంస్థకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అన్నదాన పథకానికి రూ.1,10,116 విరాళం
భద్రాచలం దేవస్థానంలోని ఉచిత అన్నదాన పథకానికి భద్రాద్రి జిల్లా పాల్వంచ టీచర్స్ కాలనీకి చెందిన గండికోట సూర్యకాంతం రూ.1,10,116 విరాళం అంద జేశారు. సోమవారం రామయ్య సన్నిధికి కుటుంబ సమేతంగావచ్చిన ఆమె.. మూలమూర్తుల వద్ద ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు.