తిరుమల : హైదరాబాద్కు చెందిన లేవేన్ హోల్డింగ్స్ ( Leven Holdings ) సంస్థ టీటీడీ( TTD ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ ధార్మిక, సేవా ట్రస్టులకు రూ.1.10 కోట్లు విరాళాన్ని అందించింది. సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ వెంకట రవికుమార్ సోమవారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి విరాళాల డీడీలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.1 కోటి, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.