హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం మల్లన్నకు అమెరికాకు చెందిన ఓ భక్తుడు మంగళవారం భూరి విరాళం సమర్పించారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వ చ్చిన అమెరికా భక్తుడు కొత్తపల్లి సునీల్దత్ బంగారు, వెండి సామగ్రి, ఆభరణాలను ఆలయానికి అందజేశారు. 28.3 గ్రాములున్న 2 బంగారు బాషికాలు, 5 గ్రాముల బంగారు కం కణం, 1.25 కిలోల వెండి పళ్లెం, 865 గ్రాము ల వెండి శక్తి ఆయుధం, 550 గ్రాముల వెండి నాగహారతి, 290 గ్రాముల కుకుట ధ్వ జం,750 గ్రాముల ఐదు వెండి గిన్నెలు, 920 గ్రాముల గంధాక్షత గిన్నె, 190 గ్రాముల క మండలాన్ని, 300 గ్రాముల పెద్ద కమండలా న్ని కొత్తపల్లి సునీల్దత్ కుటుంబం అందజేసిం ది.
నంద్యాల జిల్లా పగిడాలకు చెందిన కౌలూ రి సింధూర కూడా 810, 350 గ్రాముల చొప్పున 2 వెండి పళ్లాలు, 615 గ్రాములున్న 3 వెండి చెంబులను ఆలయానికి అందజేశారు. అనంతరం దాతలకు దేవస్థానం అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం అందజేసి స తరించారు. రెండురోజుల క్రితం చెన్నైకి చెంది న భక్తురాలు కోనేరు విమలాదేవి స్వామివారికి 343 గ్రాముల బంగారు పళ్లెం అందజేశారు.