హైదరాబాద్, జనవరి 13(నమస్తే తెలంగాణ)/మలక్పేట: రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బొట్ల కమలాకర్కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.3 లక్షల విలువైన వినికిడి యంత్రం మంజూరైంది. ఆ ఉపకరణాన్ని గురువారం దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి తన కార్యాలయంలో లబ్ధిదారుడికి అందజేశారు. అనంతరం దివ్యాంగుల సంక్షేమ భవన్ నుంచి సంస్థ ఎండీ శైలజతో కలిసి జిల్లా డీడబ్ల్యూవోలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 31లోగా అన్ని జిల్లాల్లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీని పూర్తిచేయాలని సూచించారు.