ఉస్మానియా దవాఖాన భవనం దుస్థితిపై ముందుగా మాట్లాడింది సీఎం కేసీఆరే. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్న విషయం గవర్నర్కు తెలియదా? అసలు విషయాలు పక్కనబెట్టి బురద జల్లే వ్యాఖ్యలు చేయడం బాధాకరం.
-మంత్రి హరీశ్
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజకీయ విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురదచల్లడం బాధాకరమని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా దవాఖాన భవనంపై గవర్నర్ చేసిన ట్వీట్ దురదృష్టకరమని అన్నారు. బుధవారం కోఠిలోని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ నూతన కార్యాలయం, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ పోర్టల్ను మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉస్మానియా దవాఖాన భవన దుస్థితిపై మొద ట స్పందించింది సీఎం కేసీఆరేనని గుర్తు చేశా రు. 2015 జూలైలో దవాఖానను సీఎం సందర్శించారని, నూతన భవన నిర్మాణానికి వెంట నే రూ. 200 కోట్లు విడుదల చేశారని చెప్పారు. నెల తిరగకముందే ఆగస్టు 5న కొందరు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని, అప్పటి నుంచి ఈ అంశం న్యాయ వివాదంలోనే ఉన్నదని తెలిపారు.
భవన పరిస్థితిపై ఈఎన్సీలతో కూడిన నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించిందని, వారు పరిశీలించి భవనం పనికిరాదని తేల్చారని తెలిపారు. కోర్టు సూచనల మేరకు ఐఐటీ హైదరాబాద్కు చెంది న నిపుణులు, పురావస్తుశాఖ డైరెక్టర్తో కూడిన స్వతంత్ర కమిటీని వేశామని వెల్లడించారు. వారు కూడా భవనాన్ని పరిశీలించి దవాఖాన నిర్వహణకు పనికిరాదని స్పష్టం చేశారని వివరించారు. ప్రభుత్వం కూడా భవనాన్ని కూల్చి కొత్తది కడతామని కోర్టుకు నివేదించిందని గుర్తు చేశారు. తుది నిర్ణయం కోర్టు పరిధిలో ఉన్నదని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ గవర్నర్కు తెలియవా? అని ప్రశ్నించారు. అసలు విషయా న్ని పక్కనబెట్టి రాజకీయంగా బురదజల్లే వ్యా ఖ్యలు చేయ డం బాధాకరమని అన్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సింది పోయి.. కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు, భూతద్దం పెట్టి వె తికినట్టుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మంచి ఎందుకు కనిపించదు?
‘మంచి కనిపించదు, మంచి వినిపించదు, మంచిని చూడం.. చెడును మాత్రమే చూస్తాం, చెడు మాత్రమే వింటాం, చెడు మాత్రమే చెప్తాం’ అన్నట్టుగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని మంత్రి హరీశ్ ఫైర్ అయ్యారు. నేను రాను బిడ్డో సరారు దవాఖానకు అనే స్థితి నుంచి నేను వస్తా బిడ్డా సరారు దవాఖానకు అనే స్థాయికి తీసుకొచ్చిన విషయం ఆమెకు ఎందుకు కనిపించటం లేదని విస్మయం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న గవర్నర్ ఆ పదవి ఔన్నత్యాన్ని పెంచాల్సిందిపోయి, రాజకీయ విమర్శలు చేయడం దురదృష్టకరమని అన్నారు. ఈ సందర్భంగా గవర్నర్కు మంత్రి హరీశ్రావు పలు ప్రశ్నలు సంధించారు.
8 లక్షల మలేరియా ర్యాపిడ్ కిట్లు
సీజనల్ వ్యాధులపై డీఎంహెచ్వోలతో సమీక్ష నిర్వహించినట్టు మంత్రి హరీశ్ తెలిపారు. కలుషిత నీటి ద్వారా వచ్చే కలరా వంటి వ్యాధులు మిషన్ భగీరథతో దాదాపు తగ్గిపోయానని వివరించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా చాలావరకు కీటక జనిత వ్యాధులు తగ్గాయని వెల్లడించారు. అటు.. మలేరియాను గుర్తించేందుకు 8 లక్షల ర్యాపిడ్ కిట్లను ఇప్పటికే అన్ని పీహెచ్సీలకు పంపించామని చెప్పా రు. డెంగీని గుర్తించేందుకు 1.23 లక్షల ఎలిజా కిట్లను పంపిణీ చేశామని చెప్పారు. డెంగీ రోగులకు చికిత్స అందించేందుకు 26 దవాఖానల్లో బ్లడ్ కాంపోనెంట్ మెషీన్లు అందుబాటులో ఉన్నాయన్నారు.
హరీశ్రావు సంధించిన ప్రశ్నలు
ప్రపంచమే అబ్బురపడేలా, దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సిబ్బంది కంటి వెలుగును అద్భుతంగా నిర్వహించారు. దవాఖాననే ప్రజల వద్దకు తీసుకెళ్లి, 100 రోజుల్లో 1.62 కోట్ల మందికి పరీక్షలు చేసి, 45 లక్షల మందికి కండ్లద్దాలు పంపిణీ చేశా రు. ప్రభుత్వం చేసిన ఈ కార్యక్రమాన్ని గానీ, రేయింబవళ్లు శ్రమించిన సిబ్బందిని గానీ ఎందుకు అభినందించలేదు?
నిమ్స్ దవాఖానను 900 పడకల నుంచి 1,500 పడకలకు పెంచాం. కొత్తగా 2,000 పడకలతో విస్తరణ పనులు చేప ట్టాం. 4 వేల పడకల సూపర్ స్పెషాలిటీగా అప్గ్రేడ్ చేస్తుంటే ఇది మంచి పని అని ఒక ట్వీట్ కూడా ఎందుకు చేయలేదు?
కేసీఆర్ కిట్లు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ వంటి కార్యక్రమాలు అమలు చేసి, ప్రభు త్వ దవాఖానల్లో వసతులు పెంచి మాతాశిశు మరణాలను 43కు తగ్గించాం. దేశంలోనే తెలంగాణ మూడో స్థా నంలో ఉన్నదని కేంద్రమే చెప్పింది. దీన్ని అభినందించటానికి ఎందుకు మనసు రాదు?
2014లో ప్రభుత్వ దవాఖానల్లో 30 శాతం డెలివరీలు జరిగితే, ఇప్పుడు 70 శాతానికి పెంచాం. ఆశాలు మొదలు అన్ని స్థాయిల సిబ్బంది కృషితో తొమ్మిదేండ్లలో సీన్ రివర్స్ అయ్యింది. దేశంలో 100% దవాఖాన ప్రసవాలు జరుగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కేంద్రమే చెప్పింది. ఇది గవర్నర్కు ఎందుకు కనిపించదు?
జిల్లాకు ఒక మెడికల్ కాలేజీతో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించాం. గతంలో 20 ఏండ్లకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే సీఎం కేసీఆర్ 9 ఏండ్లలోనే 21 కాలేజీలను ఏర్పాటు చేశారు. ఇంజినీర్లు, టీఎస్ఎంఎస్ఐడీసీ సిబ్బం ది, ప్రొఫెసర్లు ఎంత కష్టపడితే ఇవి వచ్చా యి? వీటి గురించి ఒక్కసారి కూడా ఒక్క మంచి మాట చెప్పరెందుకు?
లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లతో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. లక్ష జనాభాకు 7 పీజీ సీట్లతో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాం. తెలంగాణ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదవాల్సిన దుస్థితిని తప్పించాం. ఈ విషయంపై గవర్నర్ ఎందుకు స్పందించరు? ఒక డాక్టర్గా ఆమె కనీసం ఈ విషయంలోనైనా అభినందించాలి కదా?
డయాలసిస్ సెంటర్లు గతంలో మూడు ఉంటే 102కు పెంచాం. సింగిల్ యూజ్డ్ ఫిల్టర్ వాడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. దీనిపై ఎందుకు స్పందించరు?
గాంధీ, నిమ్స్, ఉస్మానియాలో పేదలకు ఒక రూపాయి ఖర్చు కాకుండా అవయవ మార్పిడులు చేస్తున్నాం. వైద్యుల మనోధైర్యం పెంచేలా అభినందిస్తూ ఒక మాట కూడా ఎందుకు అనరు?
నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో తెలంగాణ మూడో స్థానానికి చేరింది. ఇది గవర్నర్కు కనిపించదా?
బస్తీ దవాఖానలను నీతి ఆయోగ్ సైతం ప్రశంసించింది. వీటితో గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఫీవర్ హాస్పిటల్ వంటి పెద్ద దవాఖానలపై ఒత్తిడి తగ్గింది. ఇది ఎందుకు కనిపించదు?