నాంపల్లి కోర్టులు, జూలై 4 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దొడ్డ శివారెడ్డి తరఫున వేసిన బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ 12వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ పీపీ వాదనలను ఏకీభవిస్తూ తీర్పు వెల్లడించారు. మహ్మద్ ఖాలీద్ తరఫున మంగళవారం వాదనలు ముగిశాయి.
పీపీ మాత్రం బెయిల్ మంజూరు చేయవద్దని వ్యతిరేకించారు. పూల రమేశ్కు తన ఇంటిని అద్దెకు ఇవ్వడంతోపాటు ప్రశ్నపత్రాల పంపిణీ విషయంలో సహకరించాడని, దొడ్డ శివారెడ్డికి రూ.2 లక్షలు అందించినట్టు కోర్టుకు తెలిపారు. చాట్ జీపీటీ ద్వారా శివారెడ్డితో కలిసి జవాబులను అందించడంలో సహకారం అందించాడని పేర్కొన్నారు. కీలక ఆధారాలు సేకరించాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయకూడదని కోర్టుకు వివరించారు. ప్రధాన నిందితులు పులిదిండి ప్రవీణ్కుమార్, రాజశేఖరరెడ్డి తరఫున బెయిల్ పిటిషన్లు దాఖలు చేయలేదు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను సిట్ అరెస్టు చేసి విచారిస్తున్నది. మెజిస్ట్రేట్ ఇంటి దగ్గర హాజరుపర్చేందుకు రిమాండ్ రిపోర్టును సిద్ధం చేస్తున్నది.