హైదరాబాద్ : సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం( TammineniVeerabhadram) చికిత్సకు స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు(AIG Hospital) తెలిపారు. ఈ మేరకు తమ్మినేని హెల్త్ బులెటిన్(Health Bulletin)ను విడుదల చేశారు. తమ్మినేని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. రానున్న రెండు రోజులు కీలకమని వైద్యులు తెలిపారు. కాగా, తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా రూరల్ మండల పరిధిలోని తన స్వగ్రామమైన తెల్దారుపల్లిలో సోమవారం అస్వస్థతకు గురయ్యారు.
మధ్యాహ్నం ఆయనకు ఉన్నట్టుండి చెమటలు పట్టాయి. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడ్డారు. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆయన్ను ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. వైద్యులు ఆయన్ను పరీక్షించి హార్ట్బీట్ తక్కువ సార్లు నమోదవుతున్నదని గుర్తించారు. అనంతరం కుటుంబసభ్యులు అతడిని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్కు తరలించారు.