కామారెడ్డి: ఓ వ్యక్తి తనకు ఛాతినొప్పి (heart attack) రావడంతో దవాఖానకు వచ్చాడు. అతడికి వైద్యం చేస్తుండగా డాక్టర్కు కూడా గుండెపోటు వచ్చింది. దీంతో రోగి, డాక్టర్ ఇద్దరు మృతిచెందిన ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది.
జిల్లాలోని గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన వ్యక్తికి ఛాతినొప్పి వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని గాంధారిలోని నర్సింగ్ హోమ్కు తీసుకువచ్చారు. బాధితుడికి చికిత్స చేస్తుండగా డాక్టర్ లక్ష్మణ్కు కూడా గుండె పోటు రావడంతో మృతి చెందారు. అయితే రోగిని కామారెడ్డిలోని మరో దవాఖానకు తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందాడు. దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొన్నది.