బాన్సువాడ, జూలై 21: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఈ నెల 24న నిర్వహించే ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని తన నివాసం నుంచి బాన్సువాడ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాల్ ద్వారా సమీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 24వ తేదీ ఉదయం 10 నుంచి ముక్కోటి వృక్షార్చన కార్యక్రమంజరుగుతుందన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో 3 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.
సింగరేణిలో 5 లక్షల మొక్కలు నాటాలి..!
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఈనెల 24న సింగరేణి వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటాలని సింగరేణి డైరెక్టర్లు సూచించారు. బుధవారం మొక్కల పంపిణీతోపాటు కరోనాపై డైరెక్టర్లు చంద్రశేఖర్, బలరాం, సత్యనారాయణరావు తదితరులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొక్కలు నాటడం, అవసరమైన మొక్కల పంపిణీపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.