హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూము ల్లో మరే ఇతర ఈవీఎంలను ఉంచవద్దని కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు అజయ్ వీ నాయక్ రాష్ట్ర పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఓటరు కార్డుల ముద్రణను ఈ నెల 20లోగా పూర్త చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లోని ఎన్నికల అధికారులతో మంగళవారం రెండోరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలను సమర్థంగా నిర్వహించేందుకు సలహాలు ఇచ్చారు.
ఎన్నికల విధులతో సంబంధంలేని వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్ద తిరగడాన్ని అనుమతించకూడదని మరో కేంద్ర ప్రత్యేక పరిశీలకుడు దీపక్ మిశ్రా సూచించారు. షాడో రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని కేంద్ర (వ్యయ) ప్రత్యేక పరిశీలకుడు ఆర్ బాలకృష్ణన్ ఆదేశించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు కేవలం సాంకేతిక కారణాలతో అనుమతులను తిరసరించవద్దని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ సూచించారు. వీసీకి అదనపు సీఈవో లోకేశ్ కుమార్, జాయింట్ సీఈవో సర్ఫరాజ్ అహ్మద్, డిప్యూటీ సీఈవో సత్యవాణి, డీజీపీ అంజనీ కుమార్, రాష్ట్ర నోడల్ అధికారి (వ్యయం) మహేశ్ భగవత్, రాష్ట్ర పోలీసు నోడల్ అధికారి సంజయ్కుమార్ జైన్ హాజరయ్యారు.