కందుకూరు, ఏప్రిల్ 3 : బీజేపీ నాయకుల మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరకంచె. సార్లరావుల పల్లి గ్రామాలకు చెందిన 100మందికి పైగా మహిళలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికి గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో జరుగున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి అందరి చూపు టీఆర్ఎస్ పార్టీ ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అందరి దృష్టి టీఆర్ఎస్ వైపు మల్లిందన్నారు.
అందులో భాగంగా ఎంతో మంది పార్టీలో చేరుతుంటే ప్రతి పక్షాలకు మింగుడు పడక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీల నాయకులు చెబుతున్న మాయమాటలను ప్రజలు నమ్మరన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇష్టాను సారంగా మాట్లాడుతున్నారని వాస్తవాలు తెలుసుకొని మాట్లాడలని హితవు పలికారు.