Telangana | దవాఖానల్లో ఉన్న జనరేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం ఆదేశించింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పనిచేసేలా సిద్ధంగా ఉంచుకోవాలని సూపరింటెండెంట్లు, డైరెక్టర్లకు సర్క్యులర్ జారీ చేసింది.
ఇటీవల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయాలు, కోతల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వరంగల్ ఎంజీఎం, భువనగిరి జిల్లా దవాఖానల్లో విద్యుత్ కోతలు, అదే సమయంలో జనరేటర్లు పనిచేయక రోగులు తీవ్ర అవస్థలుపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.