హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): దీపావళి పర్వదినం సందర్భంగా ఈ నెల 24వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.
2021 నవంబర్ 26న ప్రకటించిన సెలవుల క్యాలెండర్లో దీపావళి సెలవును 25గా ప్రకటించింది. వివిధ కారణాలతో వేద పండితులు 24న దీపావళి పండుగ జరుపుకోవాలని నిర్ణయించిన నేపథ్యంలో సెలవు దినాన్ని 25 నుంచి 24వ తేదీకి మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.