పెద్దపల్లి : దివ్యాంగులను చిన్నచూపుతో కాకుండా ప్రేమతో చూడాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపెల్లి వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 114 మంది దివ్యాంగులకు 60 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన స్కూటీలు, బ్యాటరీ ట్రై సైకిల్స్, లాప్టాప్, స్మార్ట్ ఫోన్స్ తో పాటు ఉపకరణాలను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది దివ్యాంగుల సంక్షేమం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో రూ.500 పింఛన్ ఉండగా రూ.3016లకు పెంచిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమత రెడ్డి, జెడ్పిటిసి రామ్మూర్తి తో పాటు ప్రజా నిధులు, దివ్యాంగులు పాల్గొన్నారు.