హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది మంది జిల్లా జడ్జీలు బదిలీ అయ్యారు. జిల్లా జడ్జీల బదిలీలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జిగా వై రేణుక, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఇ తిరుమలదేవీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శిగా ఎంవీ రమేశ్, రాష్ట్ర జ్యుడిషీయల్ అకాడమీ డైరెక్టర్గా సీహెచ్కే భూపతి, నల్లగొండ జిల్లా ప్రిన్సిపల్ జడ్జిగా బీఎస్ జగ్జీవన్ కుమార్, నిజామాబాద్ జిల్లా ప్రిన్సిపల్, సెషన్స్ జడ్జిగా సునీత కుంచాల, ఆదిలాబాద్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిగా రామకృష్ణ సునీత, సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా వీబీ నిర్మల గీతాంబ, రాష్ట్ర వ్యాట్ అప్పీలేట్ ట్రైబ్యునల్ చైర్పర్సన్గా జీ అనుపమ చక్రవర్తి బదిలీ అయ్యారు.