కొత్తకోట, ఏప్రిల్ 29: ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్లలో ఓటమి పాలవుతామని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి భయం పట్టుకున్నది. దీనిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం నాటవెల్లిపెద్ద తండా, భూత్కూర్ గ్రామాల్లో సీఎం రేవంత్రెడ్డి, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి బొమ్మలతో కూడిన గోడ గడియారాలను పంపిణీ చేశారు. ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారి, కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు జడ్పీ వైస్చైర్మన్ వామన్గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, చెన్నకేశవరెడ్డి తెలిపారు. అమలుకానీ హామీలతో గద్దెనెక్కింది చాలక.. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరారు.